దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త రూల్ ప్రవేశపెట్టింది. ఎన్నికలకు ప్రచారం నిర్వహించే అభ్యర్థులు ముందస్తుగా అనుమతి తీసుకోవాలని తెలిపింది. ఏ పార్టీకి చెందిన అభ్యర్థులైనా ప్రచారాలకు సంబంధించి 48 గంటల ముందు సువిధ అనే యాప్లో అప్లై చేసుకోవాలని చెప్పింది. ఇలా అప్లై చేసుకున్న 24 గంటల్లోనే అనుమతి వస్తుందని పేర్కొంది.