గాజాలో సురక్షిత జోన్గా ప్రకటించిన ప్రాంతంలో కొంత భాగాన్ని ఖాళీ చేయాలని పాలస్తీనీయులకు ఇజ్రాయెల్ సైన్యం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాంతాన్ని స్థావరంగా చేసుకుని హమాస్ ఉగ్రవాదులు రాకెట్ దాడులు చేస్తున్నారని టెల్అవీవ్ ఆరోపించింది. కాగా మధ్యధరా సముద్ర తీరం వెంబడి 14 కి.మీ మేర విస్తరించి ఉన్న సురక్షిత జోన్లో ప్రస్తుతం 18 లక్షల మంది పాలస్తీనీయులు ఆశ్రయం పొందుతున్నట్లు అంచనా.