కర్ణాటకలో బీమా సొమ్ము కోసం తనను పోలిన వ్యక్తిని చంపిన వ్యాపారి.. బంధువైన పోలీస్‌ను సాయం కోరి అరెస్ట్

54చూసినవారు
కర్ణాటకలో బీమా సొమ్ము కోసం తనను పోలిన వ్యక్తిని చంపిన వ్యాపారి.. బంధువైన పోలీస్‌ను సాయం కోరి అరెస్ట్
కర్ణాటకలో ఓ వ్యాపారి తనను పోలి ఉన్న వ్యక్తిని భార్య, ట్రక్ డ్రైవర్ సాయంతో చంపి, బీమా సొమ్ము కాజేయాలనుకున్నాడు. అయితే చివరకు వీరు వ్యాపారి బంధువైన ఓ పోలీసును సాయం కోరి అరెస్టు అయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం, వీరు హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలనుకున్నారు. ఇందుకోసం వ్యాపారి భార్య ఆ వ్యక్తికి అంత్యక్రియలు కూడా జరిపించింది. క్లెయిమ్ ప్రక్రియ అంతా సాఫీగా సాగేలా చూడాలని బంధువైన ఓ పోలీసును వ్యాపారి కోరడంతో విషయం తెలిసింది.

సంబంధిత పోస్ట్