ఐటీఐ ప్రవేశాలకు గడువు పొడిగింపు

75చూసినవారు
ఐటీఐ ప్రవేశాలకు గడువు పొడిగింపు
తెలంగాణలో ఐటీఐ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు. వివిధ ట్రేడ్లలో చేరేందుకు 8, 10వ తరగతి పాసై, 1-8-2024 నాటికి 14 ఏళ్లు నిండిన విద్యార్థులు అర్హులు. గత కౌన్సెలింగ్ లో సీట్లు పొందని అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలకు https://iti.telangana.gov.in/ వెబ్ సైట్ సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్