రెండు రోజుల్లో అల్పపీడనం.. ఏపీకి రెయిన్ అలర్ట్

54చూసినవారు
రెండు రోజుల్లో అల్పపీడనం.. ఏపీకి రెయిన్ అలర్ట్
ఏపీకి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. మరో రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం రానున్న 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇది మయన్మార్, థాయిలాండ్ మీదుగా మధ్య అండమాన్‌లోకి ప్రవేశించనుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్