ఘోర విమాన ప్రమాదం.. 8 మందికి గాయాలు!

555చూసినవారు
ఘోర విమాన ప్రమాదం.. 8 మందికి గాయాలు!
మిజోరాం రాజధాని ఐజ్వాల్‌లోని లెంగ్‌పుయ్ ఎయిర్‌పోర్టులో మంగళవారం విమానం ప్రమాదానికి గురైంది. మయన్మార్ నుంచి వచ్చిన సైనిక విమానం ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి రన్‌వేపై స్కిడ్ అయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మయన్మార్ సిబ్బంది గాయపడ్డారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 13 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.