హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

82చూసినవారు
హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
నేషనల్ హైవేపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. జనగామ జిల్లా రఘునాథపల్లిలోని హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో మొబైల్ టిఫిన్ సెంటర్‌ను అతివేగంతో ఆర్టీసీ గరుడ బస్సు అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. టిఫిన్ సెంటర్ వద్ద టిఫిన్ చేస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్