ఎయిర్‌ ఫోర్స్‌ మాజీ చీఫ్‌ సతీమణి ఓటు గల్లంతు

69చూసినవారు
ఎయిర్‌ ఫోర్స్‌ మాజీ చీఫ్‌ సతీమణి ఓటు గల్లంతు
ఎయిర్‌ ఫోర్స్‌ మాజీ చీఫ్‌ ప్రదీప్ వసంత్ నాయక్ సతీమణి ఓటు గల్లంతైంది. ఓటర్ల జాబితా నుంచి తన భార్య మధుబాల పేరు తొలగించడంపై ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రదీప్ వసంత్ నాయక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం పుణెలోని సాప్లింగ్ స్కూల్ బ్యానర్ రోడ్‌లోని పోలింగ్ బూత్ నంబరు 26లో ఓటింగ్ ప్రారంభమైన వెంటనే ఏసీఎం నాయక్, తన భార్య, కుమారుడు వినీత్‌తో కలిసి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. అయితే తన భార్య పేరు ఓటరు జాబితాలో కనిపించలేదు.

సంబంధిత పోస్ట్