అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది. కమాన్ సర్కిల్లో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరు పార్టీల నాయకులు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ రాళ్ల దాడిలో వైసీపీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.