స్వతంత్ర అభ్యర్థిపై ఆర్థిక మంత్రి అనుచరుల దాడి

56చూసినవారు
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కుల వివక్షతో తిట్టి తన అనుచరులను తనపై దాడి చేయడానికి ప్రయత్నించేలా చేశాడని డోన్ నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పిఎన్ బాబు ఆరోపించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల పరిశీలనలో భాగంగా బేతంచెర్ల పట్టణంలోనికి వెళుతుండగా నా ముందు వెళ్తున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన కారు ఆపి తన కారు వెంట ఎందుకు నువ్వు వస్తున్నావ్ అంటూ తనను నిలదీశాడని తెలిపారు. దానికి నేను స్వతంత్ర అభ్యర్థిని అంటూ చెప్పగా అతని అనుచరులు నా కారుపై దాడి చేసి కుల వివక్ష పేరుతో తిట్టి, వారు తెచ్చుకున్న రాడ్లతో తన కారు అద్దాలు పగలగొట్టి తనపై దాడికి ప్రయత్నించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్