ఆస్తిని పంచాలని వేధిస్తున్న కన్నకొడుకును మద్యం తాగించి కాలితో గొంతు నొక్కి తండ్రే హత్య చేసి బావిలో పడేశాడు. 14 రోజుల తర్వాత ఈ విషయం మద్యం తాగి బయట పెట్టడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో ఆదివారం పోలీసులకు లొంగిపోయాడు. శామీర్పేట మండలం లాల్గడిమలక్పేట గ్రామానికి చెందిన కొర్వి రాంచందర్కు పెద్దకుమారుడు నరేశ్ (27) మద్యం, గంజాయికి బానిసయ్యాడు. దీంతో ఆస్తి పంచాలని వేధించడంతో తండ్రే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.