పవన్ కుమారుడు స్కూల్‌లో అగ్ని ప్రమాదం.. స్పందించిన సీఎం

57చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్‌లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు స్పందించారు. 'మార్క్ శంకర్‌కు గాయాలైన విషయం ఆందోళన కలిగించింది. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను' అని CM 'X' వేదికగా వెల్లడించారు. కాగా, మార్క్‌ శంకర్‌ కాళ్లకు స్వల్ప గాయాలయినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్