చేప ప్రసాదం.. పోటెత్తిన ఆస్తమా పేషెంట్స్

52చూసినవారు
చేప ప్రసాదం.. పోటెత్తిన ఆస్తమా పేషెంట్స్
ఆస్తమా పేషెంట్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం సహకారంతో బత్తిన కుటుంబం చేపడుతున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. శనివారం ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ ప్రసాద్ రావు, HYD మేయర్ విజయలక్ష్మి చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించారు. శుక్రవారం నుంచి శనివారం రాత్రి వరకు సుమారు 1.25 లక్షల టోకెన్లను ఉబ్బస వ్యాధిగ్రస్తుల కోసం అందించారు. సుమారు 1.6 లక్షల చేపపిల్లలను అందుబాటులో ఉంచారు. చేప ప్రసాదం పంపిణీ రేపు మ. 12 గంటల వరకు కొనసాగనుంది.