చేతబడి చేశారనే అనుమానంతో ఒకే కుటుంబంలో ఐదుగురిని చంపేశారు

75చూసినవారు
చేతబడి చేశారనే అనుమానంతో ఒకే కుటుంబంలో ఐదుగురిని చంపేశారు
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. కుంట పీఎస్ పరిధిలో ఏక్తాల్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని చేతబడి చేశారనే అనుమానంతో హత్య చేశారు. వారు చేతబడి చేయడం వల్లే తమ కుటుంబ సభ్యులు అస్వస్థతకు గురయ్యారని భావించిన మరో కుటుంబం దారుణంగా చంపేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్