సర్జరీ అయిన చోటే పంత్‌‌‌‌‌కు గాయమైంది: రోహిత్ శర్మ

84చూసినవారు
సర్జరీ అయిన చోటే పంత్‌‌‌‌‌కు గాయమైంది: రోహిత్ శర్మ
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌‌ మరోసారి గాయపడ్డాడు. వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో బంతి నేరుగా అతని కుడి మోకాలికి బలంగా తగలడంతో పంత్ కుప్పకూలాడు. రెండో రోజు ఆట అనంతరం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ.. పంత్ గాయం గురించి కీలక అప్‌డేట్ ఇచ్చాడు. 'రిషభ్ పంత్ మోకాలు వాచింది. అదే మోకాలికి సర్జరీ అయింది. అతని విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోం. ఇదే మ్యాచ్‌లో అతను మళ్లీ బరిలోకి దిగుతాడని ఆశిస్తున్నాం.' అని చెప్పుకొచ్చాడు.

సంబంధిత పోస్ట్