బహుళ అంతస్తుల భవనం కుప్పకూలడంతో ఉత్తరప్రదేశ్ లో ఐదుగురు మృతి, 24 మందికి గాయాలు

65చూసినవారు
బహుళ అంతస్తుల భవనం కుప్పకూలడంతో ఉత్తరప్రదేశ్ లో ఐదుగురు మృతి, 24 మందికి గాయాలు
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 24 మంది గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. “ఎన్ డిఆర్ఎఫ్, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం నుంచి రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు కృషి చేస్తున్నాయి” అని అగ్నిమాపక అధికారి పీటీఐకి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్