దుబాయ్‌లో వరద బీభత్సం.. తెలుగు ప్రవాసీ మృతి

65చూసినవారు
దుబాయ్‌లో వరద బీభత్సం.. తెలుగు ప్రవాసీ మృతి
75 ఏళ్ల చరిత్రలో కనివీని ఎరుగని విధంగా కురిసిన అకాల వర్షాలు.. దుబాయ్‌ను అతలాకుతలం చేశాయి. ఈ వరద బీభత్సానికి ఓ ప్రవాస భారతీయుడు మృతి చెందాడు. రాజన్నసిరిసిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన భాస్కర్ అనే ఓ ప్రవాసీయుడు.. జలప్రళయానికి భయపడి కారులోనే గుండె ఆగి చనిపోయాడు. నీటి ప్రవాహంలో కారు కొట్టుకోపోవడం వల్ల మరణించాడా లేక.. నీళ్లను చూసి గుండేపోటుతో మరణించాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.