లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్కు గట్టి షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి(ముధోల్), కోనేరు కోనప్ప(సిర్పూర్), పైళ్ల శేఖర్ రెడ్డి(భువనగిరి) త్వరలోనే బీఆర్ఎస్కు వీడ్కోలు చెప్పి,
కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. కాగా, మాజీ బీఆర్ఎస్ ఎంపీలు సీతారాం నాయక్, నగేశ్, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి నిన్న బీజేపీలో చేరారు.