ప్రజల్లోకి మాజీ CM కేసీఆర్.. ఎప్పుడంటే?

50చూసినవారు
ప్రజల్లోకి మాజీ CM కేసీఆర్.. ఎప్పుడంటే?
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ డిసెంబరులో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సర్కార్ ఏడాది పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో.. వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి తమ వైఖరిని వెల్లడించాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. గులాబీ బాస్ ను కలుస్తున్న నేతలకు ఈ మేరకు సంకేతాలు ఇస్తున్నట్లు టాక్. వివిధ అంశాలు, ప్రజల సమస్యలపై పార్టీ తరపున ప్రస్తుతం అనుసరిస్తున్న తరహాలోనే ఉండాలని సూచించినట్లు తెలుస్తోది.

సంబంధిత పోస్ట్