నల్గొండ మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్రెడ్డి (85) సోమవారం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. మంగళవారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పీఏపల్లి మండలం అజ్మాపురానికి చెందిన దామోదర్రెడ్డి 1980లో నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 1984లో ఇదే స్థానం నుంచి ఎంపీగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి రఘుమారెడ్డి చేతిలో ఓడిపోయారు.