అలంపూర్ నియోజకవర్గ అయిజ మున్సిపాలిటీలోని 15వ వార్డులో నీటి సమస్యతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. హరిజనవాడ పాఠశాల నుండి బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు గత నాలుగు నెలల నుండి తాగు నీరు సరిగా సరఫరా కావడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.