మహారాష్ట్రలోని పాల్ఘర్లో హైవేపై షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. ఓ కారు వేగంగా వెళ్తుండగా అదే సమయంలో బైక్పై ముగ్గురు రోడ్డు దాటారు. పొగమంచు వల్ల కారుడ్రైవర్కు బైక్ కనిపించలేదు. దీంతో బైక్ను కారు ఢీకొట్టింది. బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురు ఎగిరి కింద పడ్డారు. అదృష్టవశాత్తూ వారికి ప్రాణాపాయం తప్పింది. చిన్నపాటి గాయాలతో తప్పించుకున్నారు. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.