క్రిమి సంహారకాలు, రసాయనాల వాడకంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

71చూసినవారు
క్రిమి సంహారకాలు, రసాయనాల వాడకంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
పంటలు, ఆహార పదార్థాలపై క్రిమి సంహారక మందులు, ఇతర రసాయనాలు అధికంగా వాడడం వల్ల దేశవ్యాప్తంగా మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్రానికి, పలు శాఖలకు నోటీసులు పంపింది. ఈ పిటిషన్‌కు స్పందించి, సమాధానాలు పంపాల్సిందిగా కోరుతూ కేంద్ర ప్రభుత్వంతోపాటు వ్యవసాయ శాఖ, భారత్‌ ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) తదితరులకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ నోటీసులు పంపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్