కేసీఆర్ చేసిన అప్పునకు నెలకు 5వేల కోట్లు కడుతున్నాం: జూపల్లి

85చూసినవారు
గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పునకు ప్రతినెలా రూ. 5 వేల కోట్లు కడుతున్నామని గురువారం మహబూబ్ నగర్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొత్తంగా రూ. 40 వేల కోట్లు కట్టామని తెలిపారు. బంగారు పల్లెంలా తెలంగాణను అప్పగించామని చెప్పుకొంటున్న బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వానికి రూ. 7. 80 లక్షల కోట్లు అప్పును అప్పగించిందన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని సంక్షేమ పథకాలను అమలు చేసామన్నారు.

సంబంధిత పోస్ట్