‘గాజా స్ట్రిప్‌లో కాల్పులు విరమించాలి’

67చూసినవారు
‘గాజా స్ట్రిప్‌లో కాల్పులు విరమించాలి’
గాజా స్ట్రిప్‌లో కాల్పులను వెంటనే విరమించాలని భారత్ తెలిపింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి బహిరంగ చర్చలో పాల్గొన్న భారత డిప్యూటీ ప్రతినిధి ఆర్ రవీంద్ర మాట్లాడుతూ.. ‘7 అక్టోబర్ 2023న ఇజ్రాయెల్‌పై జరిగిన ఉగ్రవాదులను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇజ్రాయెల్- హమాస్ వివాదంలో పౌరుల ప్రాణాలు కోల్పోవడాన్ని కూడా మేము ఖండిస్తున్నాము. చర్చల ద్వారా ఇరు దేశాలు ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్