ముగిసిన విశ్రాంత ఇంజినీర్లతో ఘోష్ కమిషన్ సమావేశం

63చూసినవారు
ముగిసిన విశ్రాంత ఇంజినీర్లతో ఘోష్ కమిషన్ సమావేశం
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విశ్రాంత ఇంజినీర్లతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమావేశం ముగిసింది. గోదావరి జలాలపై తమ నివేదిక, సంబంధిత అంశాలను విశ్రాంత ఇంజినీర్ల కమిటీ వివరించింది. ఆనకట్ట నిర్మాణానికి మేడిగడ్డ అనువైన స్థలంగా అప్పటి సీఎం సూచించారని విశ్రాంత ఇంజినీర్లు చెప్పినట్లు సమాచారం. ఆనకట్టల నిర్మాణంలో సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థపై జస్టిస్ పీసీ ఘోష్ దృష్టి సారించారు. ఈ మేరకు సబ్ కాంట్రాక్టర్ల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అఫిడవిట్లు అన్నీ వచ్చిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రారంభించనున్నారు.
Job Suitcase

Jobs near you