మహాప్రస్థానానికి బీజం పడింది అలా..

61చూసినవారు
మహాప్రస్థానానికి బీజం పడింది అలా..
చదువు ముగించుకొని 1931లో విశాఖపట్నం వచ్చిన శ్రీశ్రీ తీవ్రమైన టైఫాయిడ్ జ్వరంతో 63 రోజులు బాధపడ్డారు. విశాఖ హార్బరులో టైమ్ కీపర్ గా, AVN కాలేజీ జువాలజీ విభాగంలో డెమానిస్ట్రేటర్ గా తాత్కాలిక ఉద్యోగాలు చేశారు. 1934లో ‘మహాప్రస్థానం’ కవితా సంకలనానికి బీజం పడింది. ఆ గేయాలు ‘జ్వాల’ అనే పత్రికలో ప్రచురితమవుతూ వచ్చాయి. అక్కడ మూడేళ్లు పనిచేశాక 1938లో మద్రాసు వెళ్ళి ఆంధ్రప్రభలో సహాయ సంపాదకుడిగా చేరారు. 1942లో ఆకాశవాణి, మద్రాసు, ఢిల్లీ స్టేషన్లలో అనౌన్సర్ గా, లక్నో మిలిటరీ కంటోన్మెంట్లో లేబరేటరీ ఆసిస్టెంటుగా పనిచేశారు.

సంబంధిత పోస్ట్