పంజాబ్లోని లూథియానాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఏడాదిన్నర బాలిక చాక్లెట్ తిన్నాక అస్వస్థతకు గురైంది. కొద్ది సేపటికే ఆ బాలిక రక్తపు వాంతులు చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. బాలిక తిన్న చాక్లెట్ను పరిశీలించగా, అది ఎక్స్పైరీ డేట్ ముగిసిందని తేలింది. దీంతో బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో సంబంధిత దుకాణాన్ని అధికారులు సందర్శించారు. ఎక్స్పైరీ డేట్ ముగిసిన తినుబండారాలను గుర్తించారు.