గాజు గ్లాస్ గుర్తు.. ఈసీ కీలక నిర్ణయం

2594చూసినవారు
గాజు గ్లాస్ గుర్తు.. ఈసీ కీలక నిర్ణయం
ఏపీలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై జనసేన దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై కోర్టుకు ఈసీ నివేదిక సమర్పించింది. జనసేన పోటీచేసే అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న MP సీట్లలో, ఎంపీ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సీట్లలో గ్లాసు గుర్తును కేటాయించబోమని ఈసీ తెలిపింది. ఆయా లోక్‌సభ పరిధిలోని 7 స్థానాల్లో ఎక్కడా గ్లాసు గుర్తు ఉండదని స్పష్టం చేసింది.