బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.930 పెరిగి రూ.73,090గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.850 పెరిగి రూ.67,000గా నమోదైంది. అటు కేజీ వెండి రూ.1300 పెరిగి రూ.90,000 మార్క్కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.