గుడ్ న్యూస్.. త్వరలో మరో 250 సబ్‌అర్బన్ రైళ్లు

52చూసినవారు
గుడ్ న్యూస్.. త్వరలో మరో 250 సబ్‌అర్బన్ రైళ్లు
రాబోయే ఐదేళ్లలో ముంబై కోసం భారతీయ రైల్వే ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ముంబైకి 250 కొత్త సబర్బన్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. వీటితోపాటు రైలు నెట్‌వర్క్‌ను పునరుద్ధరించడం, ప్రయాణాన్ని సులభతరం చేయడానికి కొత్త మెగా టెర్మినల్‌లను నిర్మించనున్నారు. రైళ్ల క్రాస్ మూవ్‌మెంట్‌ను తగ్గించడానికి సబర్బన్ నెట్‌వర్క్‌ను రీడిజైన్ చేయాలని భావిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్