కేంద్రం గుడ్ న్యూస్.. త్వరలో 'పోలవరం' ప్రాజెక్ట్‌ పెండింగ్‌ నిధుల విడుదల

68చూసినవారు
కేంద్రం గుడ్ న్యూస్.. త్వరలో 'పోలవరం' ప్రాజెక్ట్‌ పెండింగ్‌ నిధుల విడుదల
పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించనుంది. జాతీయ ప్రాజెక్ట్‌గా దీని నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నిర్ణయించింది. పెండింగ్ నిధుల విడుదలకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ నిధుల విషయంలో ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఇటీవల సీఎం చంద్రబాబు కలిశారు. ఈ నేపథ్యంలోనే నిధుల విడుదలపై కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్