భారత్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారం రేటు నిన్నటి కంటే రూ.10 తగ్గింది. ఇక వెండి ధర కిలోకి రూ.100 చొప్పున తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.66,550గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,600గా ఉంది. ఇకపోతే కిలో వెండి రూ. 84,000గా ఉంది.