మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మత్తులపై ప్రభుత్వం ఫోకస్

68చూసినవారు
మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మత్తులపై ప్రభుత్వం ఫోకస్
NDSA కమిటీ మధ్యంతర సిఫార్సుల మేరక మేడిగడ్డ మరమ్మత్తులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ప్రాజెక్ట్ నిర్మించిన L&T సంస్థ మరమ్మత్తులు ప్రారంభించింది. వరదకు అడ్డంకులు లేకుండా 7వ బ్లాక్ లోని గేట్లను పూర్తిగా తెరవాలని L&T నిర్ణయించింది. ఈమేరకు ఇంజినీర్లు 7వ బ్లాక్ లోని 14-15 పిల్లర్ల మధ్య గేట్లు ఎత్తారు. 19, 20, 21 పిల్లర్ల మధ్య గేట్లు మినహా మిగతా వాటిని ఎత్తేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గేట్లు పూర్తిగా ఎత్తిన తర్వాత మరమ్మత్తులకు సన్నద్ధం కానున్నారు.