దేశంలో మొట్టమొదటిసారిగా వందే భారత్ స్లీపర్ రైలు త్వరలో పట్టాలెక్కనుంది. స్లీపర్ రైలును అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వందే భారత్ రైళ్లు ఛైర్కార్ సర్వీసులను మాత్రమే అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్లీపర్ ట్రైన్ను ఆగస్టు 15 నాటికి ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.