నందిని పాల ధరలు పెంపు

84చూసినవారు
నందిని పాల ధరలు పెంపు
కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ రాష్ట్రవ్యాప్తంగా నందిని పాల ధరలను లీటరుపై రూ.2 పెంచింది. బెంగళూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేఎమ్‌ఎఫ్‌ చైర్మన్‌ భీమా నాయక్‌ ఈ మేరకు ప్రకటన చేశారు. సవరించిన ధరలతో రూ.42గా ఉన్న లీటరు నందిని పాల ధర ఇప్పుడు రూ.44కు చేరింది. పెంచిన ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. దీనితో పాటు ప్రతి పాల ప్యాకెట్‌లో 50 ml పాలను ఎక్కువగా అందించనున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్