అమెరికాలోని బాల్టిమోర్ వంతెన కూలిపోవడానికి కారణమైన డాలి సరకు రవాణా నౌక అక్కడి నుంచి బయల్దేరింది. 16 నుంచి 18 గంటల ప్రయాణం అనంతరం ఆ నౌక వర్జీనియాలోని నార్ఫోల్క్కు చేరుకోనుంది. కాగా మార్చి 26న బాల్టిమోర్ పోర్ట్ నుంచి బయల్దేరిన నౌక కాసేపటికే పటాప్స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని ఢీకొట్టింది. దీంతో ఆ బ్రిడ్జి కుప్పకూలింది. ఆ నౌకలో ఎక్కువ మంది భారత సిబ్బందే ఉన్నారు.