దేశవ్యాప్తంగా ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

51చూసినవారు
దేశవ్యాప్తంగా ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సాయిబాబా దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయాలకు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఆదివారం కావడంతో కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శించి సాయిబాబాకు పూజలు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్