ఏపీలో వరద బాధితుల సహాయార్ధం రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చిన జీవీకే ఫౌండేషన్

76చూసినవారు
ఏపీలో వరద బాధితుల సహాయార్ధం రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చిన జీవీకే ఫౌండేషన్
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధికి దాతల విరాళాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబును హైదరాబాద్‌లో కలిసి పలువురు చెక్కులు అందించారు. జీవీకే ఫౌండేషన్ ఛైర్మన్ జీవీకే రెడ్డి, జీవీ సంజయ్ రెడ్డిలు 5 కోట్ల రూపాయలను అందించారు. అలాగే కాంటినెంటల్ కాఫీ తరఫున చల్లా శ్రీశాంత్ 1 కోటి 11 లక్షలు, చల్లా రాజేంద్రప్రసాద్ ఫ్యామిలీ ఫౌండేషన్ తరఫున చల్లా అజిత 1 కోటి రూపాయల విరాళం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్