పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. తాజాగా విడుదలైన దీని టీజర్ ఆకట్టుకుంటోంది. అయితే ఈ టీజర్ విడుదల సందర్భంగా నిర్మాతలు ఓ కీలక ప్రకటన చేశారు. ఈ చిత్రం మిగిలిన షూటింగ్ను పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ను దర్శకుడు జ్యోతి కృష్ణ పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా నుంచి డైరెక్టర్ క్రిష్ వైదొలిగారనే వార్త వైరల్ కావడంతో తాజాగా నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.