వైద్యుల రక్షణ కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎలాంటి కొత్త చట్టం తీసుకురావడం లేదు: రిపోర్ట్

82చూసినవారు
వైద్యుల రక్షణ కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎలాంటి కొత్త చట్టం తీసుకురావడం లేదు: రిపోర్ట్
వైద్యారోగ్య సిబ్బందికి రక్షణ కల్పించేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎలాంటి నూతన చట్టాన్ని తీసుకురావడం లేదని 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' తెలిపింది. వారి రక్షణ కోసం ఇప్పటికే 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో చట్టాలు అమలవుతున్నాయని, కొత్త చట్టాన్ని తీసుకురావడం వల్ల ఎలాంటి తేడా ఉండదని ఓ అధికారి తెలిపారు. అయితే, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతను 25% పెంచేందుకు మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.