ఇండోనేషియాలో భారీ వరదలు.. 50 మంది మృతి (వీడియో)

61చూసినవారు
ఇండోనేషియాలోని పశ్చిమ సుమాత్ర ప్రావిన్స్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వరదల కారణంగా దాదాపు 50 మంది చనిపోయారు. భారీగా కుండపోత వర్షాలు, మరాపీ అగ్నిపర్వతం తాలూకు కొండచరియలు విరిగిపడటంతో నదులు పొంగి పొరులుతున్నాయి. ఈ వరదల ధాటికి అనేక ఇళ్లు ధ్వంసం కాగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ వరదల్లో గల్లంతైన 27 మంది ఆచూకీ కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :