ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో.. ఇరాన్ విదేశాంగ మంత్రి అమీర్ అబ్దోల్లాహియాన్ భద్రతామండలిలో ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ తన చర్యలకు పశ్చాత్తాపపడేలా చేసేందుకు ఇరాన్ వెనుకాడబోదన్నారు. తమ దేశంపైన ఏదైనా దాడికి యత్నిస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తే.. ఇరాన్ చూస్తూ ఊరుకోదు అన్నారు.