లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. ప్రజలంతా ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు. ప్రముఖ నటుడు రజనీకాంత్ చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజ్లో నేడు ఓటు హక్కు వినియోగించుకొన్నారు. ఓటువేయడం ప్రజల కర్తవ్యమని, అందుకే ప్రతి ఒక్కరూ ఆ హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.