ఇజ్రాయెల్, లెబనాన్లోని హెజ్బొల్లాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రూప్ సీనియర్ కమాండర్ మహమ్మద్ నామేహ్ నజీర్ను ఇజ్రాయెల్ హతమార్చింది. దీనికి ప్రతీకారంగా ఆ దేశ సైనిక స్థావరాలే లక్ష్యంగా 200కు పైగా రాకెట్లు, 20కిపైగా ఆత్మాహుతి డ్రోన్లు ప్రయోగించినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. హెజ్బొల్లా దాడుల అనంతరం ఇజ్రాయెల్ సైన్యం కూడా దక్షిణ లెబనాన్ ప్రాంతంపై విరుచుకుపడింది.