28న తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు: ఐఎండీ

61చూసినవారు
28న తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు: ఐఎండీ
దేశవ్యాప్తంగా మండుతున్న ఎండలపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీచేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 28న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని స్పష్టంచేసింది. మధ్యాహ్నం నిప్పుల ఎండలు, రాత్రి వేడిగాలులు ఉంటాయని హెచ్చరించింది. దక్షిణ తెలంగాణ, రాయలసీమ, యానాంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు డిగ్రీలు అదనంగా గరిష్ఠంగా 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.