భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభ ఎన్నికల రోజున ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును ఇవ్వాలని కోరుతూ ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ప్రధాన ఎన్నికల అధికారులకు లేఖ రాసింది. కాగా లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం గతవారం వెల్లడించింది.