దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అప్పుడే రంగులతో ఆడుకోవడం ప్రారంభించారు. అయితే ఢిల్లీ నుంచి అలాంటి ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. వసంత్కుంజ్ ప్రాంతంలో ఇద్దరు యువకులు కదులుతున్న వాహనం సన్రూఫ్ నుండి వాటర్ బెలూన్లను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తులు, మహిళలపై విసురుతూ కనిపించారు. మరో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ ఇదంతా వీడియో తీసి ఎక్స్లో పోస్ట్ చేసింది. పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.