AP EAPCET పరీక్ష వాయిదా పడింది. మే 13 నుండి ఈఏపీ సెట్ పరీక్షలు మొదలవ్వాల్సి ఉంది. ఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్ కారణంగా ఈఏపీసెట్ ను మే 16కి వాయిదా వేశారు. ముందుగా మే 16,17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహించనుండగా మే 18 నుంచి 22 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. ఏపీ పీజీసెట్ జూన్ 10కి వాయిదా పడింది. ఈ పరీక్షలు జూన్ 10 నుంచి 14 వరకు నిర్వహించబోతున్నారు.