మందుబాబులకు హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక!

67చూసినవారు
మందుబాబులకు హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక!
హైదరాబాద్ నగర ప్రజలకు పోలీస్ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. బహిరంగంగా మద్యం తాగవద్దని, రోడ్ల‌పై అల్లర్లు సృష్టించవద్దని మందుబాబులను హెచ్చరించింది. అలాగే, హింసాత్మక ఘటనలు జరిగితే వెంట‌నే డయల్ 100కి కాల్ చేయాలని పోలీసులు ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన హింసాత్మక నేరాల నేపథ్యంలో శాంతిభద్రతల పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఆ నేపథ్యంలో పోలీసులు ఈ ఆదేశాలు జారీ చేశారు.